ఏపీలో ఎన్ని కరోనా కేసులంటే..!

-

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య కొంచం అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకింత శుభమే అయినా.. రానున్న రోజుల్లో ఇది ఎలా మారుతుందో అర్ధం కావట్లేదు. తాజాగా, గత 24 గంటల్లో 19,085 శాంపిళ్లను పరీక్షించగా మరో 477 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అలాగే 118 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 8,783 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 10,884 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 4,817 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,830 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 136కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news