ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 837 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 789 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది.

అలాగే 24 గంటల్లో 258మంది కరోనా నుంచి కోలుకోగా, ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 14,414 కాగా, ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 8,082 మంది ఏపీ వాసులు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 206కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news