ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, 3 మరణాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి… కేసులు గత కొంత కాలం నుంచి తగ్గుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… కేవలం 156 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడింది. అలాగే ఈ కరోనా మహమ్మారి కారణంగా కృష్ణ, నెల్లూరు మరియు విశాఖపట్నం లలో ఒక్కొక్కరూ మరణించారు.

ap carona
ap carona

గడిచిన 24 గంటల్లో ఏకంగా 188 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో.. 31,131 కరోనా పరీక్షలు నిర్వహించింది ఆరోగ్య శాఖ. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మొత్తం చేసిన కరోనా పరీక్షల సంఖ్య.. 30746537 కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… 14 వేల 465 మంది మరణించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 1954 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news