ఏపీలో 1257 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదు

-

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు ఇవాళ అమాంతం పెరిగి పోయాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 1257 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,81, 859 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరూ చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4774 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 140 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 62 , 580 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38, 479 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 16 , 05, 951 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news