ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటలో 671 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున 429 కరోనా కేసులు నమోదు కాగా ఇవాళ ఆ సంఖ్య పెరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 671 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,53, 863 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 11 మంది చని పోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,219 కి చేరింది.

ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41, 523 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 85, 17, 990 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9141 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1272 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,30, 503 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news