సీఎం చంద్రబాబునాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొబేషన్ పీరియడ్లో మాతృత్వ సెలవును డ్యూటీగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రొబేషన్ పీరియడ్లో మాత్రమే డ్యూటీ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది సర్కార్.

ఇక అటు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి. నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో హర్షం వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు.