కొత్త జిల్లాల ఏర్పాటు.. ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త

-

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. కొత్త జిల్లాలపై మార్చి ౩ వరకు సూచనలు తీసుకుంటామని.. మార్చి ౩ వరకు జిల్లా కలెక్టర్లకు ఇవ్వొచ్చని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్  చెప్పారు. అన్నింటినీ పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారని.. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.

ఏప్రిల్ 2 ఉగాది నుండి కొత్త జిల్లాల పాలన జరుగుతుందని.. మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతామని స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్ కి ఇబ్బందులు ఉండవని వెల్లడించారు. వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తామని.. రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.

కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లు నిర్మిస్తామని.. ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తామని వివరించారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తామని.. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని వెల్లడించారు.కేంద్రం అనుమతి జిల్లాల ఏర్పాటుకు అవసరం లేదని.. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news