జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ‘కరోనా హోమ్ క్వారంటైన్ కిట్’..!

-

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్‌‌లో ఉన్నవారు బయటకు రాకుండా…వారికి కావాల్సిన వాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. ‘కరోనా హోమ్ క్వారంటైన్ కిట్’‌‌‌ను పంపించనుంది. ఈ కిట్‌‌‌‌‌‌‌‌‌‌లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్‌లు, గ్లౌజ్‌‌‌‌‌‌‌లు ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ఈ కిట్‌ను అందిస్తారు. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తారు.

హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే… ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రికార్డు స్థాయిలో టెస్టింగ్ జరుపుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకి నాలుగు బస్సులను కరోనా నిర్థారణ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసింది. అలాగే జిల్లాకు రూ.కోటి ఇచ్చింది. ఇప్పుడు ఈ కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్‌లను ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news