మరోసారి ఇరుక్కుపోయిన ఏపీ పోలీసులు…!

-

ఎస్ఈబీ పోలీసుల అదుపులో ఉన్న అజయ్ అనుమానాస్పద మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సందీప్ వద్ద గత రెండేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అజయ్. హైదరాబాద్ నుండి విజయవాడ ఆర్ టి సి బస్టాండ్ కు బాస్ లో పార్శిల్ వస్తుందని, దానిని తీసుకోవాలని అజయ్ కు చెప్పాడు సందీప్. పార్శిల్ తీసుకొని వస్తున్న క్రమంలో నిడమనూరులో అక్రమ మద్యంతో పట్టుబడ్డాడు మృతుడు అజయ్.

అజయ్ ను అక్కడి నుంచి ఎస్ఈబీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. సందీప్ వివరాలు కోసం అజయ్ ని పోలీసులు కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అజయ్ మృతి చెందాడు. అయితే రమేష్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళే క్రమంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఏపీ పోలీసులకు మరో చిక్కు వచ్చి పడినట్టే కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news