పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ?

-

పవన్ కళ్యాణ్ కు ఈ మధ్యన మీటింగ్ లలో ఎటువంటి ఆధారాలు లేకుండా కామెంట్ లు చేస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఇదే విషయంపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పెర్సన్ వాసిరెడ్డి పద్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఈమె తాజాగా మాట్లాడుతూ మిస్సింగ్ కేసులు గురించి ఏ అధికారి ఈయనకు కంప్లైంట్ ఇచ్చారు అంటూ పవన్ ను ప్రశ్నించింది. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో మిస్సింగ్ కేసులు లేవా అంటూ ప్రశ్నించారు. మీటింగ్ లు పెట్టి సినిమాల డైలాగులు పేజీలకు పేజీలు చెప్పడం కాదు.. వాస్తవాన్ని గ్రహించగలగాలి అంటూ పవన్ పై ఫైర్ అయ్యారు వాసిరెడ్డి పద్మ. ఇంకా ఈమె మాట్లాడుతూ వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారు.. రాజకీయంలో ఎదగాలంటే నిజాయితీ ఉండాలి. కానీ ఎలాగైనా రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటున్నారంటూ పవన్ పై మండిపడ్డారు.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news