breaking : రెండు తెలుగు రాష్ట్రాలకు హై కోర్టు న్యాయమూర్తుల నియామకం

-

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తుల పదవులు ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజా గా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయ మూర్తులు నియామకం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా… ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజే గా బదిలీ అయ్యారు.

ఇక తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తి ని కూడా నియామకం చేశారు. కర్ణాటక హై కోర్టు యాక్టింగ్ సిజే గా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు సిజేగా బదిలీ చేశారు. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాదు.. కొత్త గా నియామకం అయిన ఇద్దరు ప్రధాన న్యాయ మూర్తులు సోమ వారం రోజున పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news