రాష్ట్రంలో బటన్ నొక్కుతున్నారా.. మోడీ వేసిన సొమ్ము లాగేసుకుంటున్నారా..? : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

-

రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం కొనసాగుతున్న  ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత చూపిస్తున్నారు ప్రజలు అని తెలిపారు. మేనిఫెస్టో లో హామీ ఇవ్వకపోయినా 11 కోట్ల రైతన్నలకు డిబిటి ద్వారా మోదీ ఇస్తున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రులు వంది మాగధులు నటులు అన్నారు. రాష్ట్రంలో బటన్ నొక్కుతున్నారా.. మోడీ వేసిన సొమ్ము లాగేసుకుంటున్నారా అని ప్రశ్నించారు సత్యకుమార్.

రైతులేమైనా తీవ్రవాదులా.. పాకిస్తాన్ నుంచీ వచ్చారా..? 1.76లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇస్తే.. రుణమాఫీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. కేంద్రం రైతులకు ఇస్తే.. ఇచ్చే సొమ్మును ఇక్కడ ప్రబుద్ధులు వాళ్ళ ఖాతాల్లో వేసుకుని ఉంటారు. రెడ్ కార్పెట్, హెలికాప్టర్ ల పై వెళ్ళేకంటే ఇంటినుంచి బైనాక్యులర్ లో చూడాల్సింది అన్నారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్ధానంలో ఉందన్నారు. NCRB ప్రకారం రాష్ట్రంలో ఆత్మహత్యల్లో 19% వృద్ధిరేటు సాధించారు. ప్రత్యేక దృష్టితో పోలవరం కోసం 17వేల కోట్లు ఇస్తే అందులోనూ అవినీతే..రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి కి డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ కు తేడా తెలియదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news