నిరుద్యోగులకు శుభవార్త..నవంబర్ 15న ఆర్మీ ర్యాలీ

-

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నవంబర్ 15 నుంచి 29 వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించనున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు యువత పాల్గొనవచ్చు.

అగ్నివీర్ (మెన్), అగ్ని వీర్ (మహిళా మిలటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ), జూనియర్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.

ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన ధృవీకరణ పత్రాలు, ఇతర సమాచారం మొత్తం వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ లో ఉంటుంది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, యువత దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి..

Read more RELATED
Recommended to you

Latest news