పవన్ కళ్యాణ్ హీరోయిన్ పై అరెస్టు వారెంట్..!

-

పవన్ కళ్యాణ్ హీరోయిన్ అమీషా పటేల్ కి తాజాగా చెక్ బౌన్స్ కేసులో రాంచీ సివిల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అమీషా పటేల్ నిర్మాణ సంస్థ దేశి మ్యూజిక్ లో రాంచీ జిల్లాకు చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి పది సంవత్సరాల క్రితం మూడు కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. ఒక సినిమా నిర్మాణంతోపాటు ప్రచారానికి ఈ డబ్బులు వినియోగించాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అజయ్ కుమార్ డబ్బు వాపస్ ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలోనే అమీషా పటేల్ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించడం జరిగింది.

ఇక విచారణ చేపట్టిన న్యాయస్థానం అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక దీనిపై అమీషా పటేల్ ఏ విధంగా వివరణ ఇస్తుందో చూడాలి ఇప్పటికే అభిమానులు ఈ విషయం తెలిసి కలవర పడుతున్నారు. త్వరగా సమస్యను సాల్వ్ చేసుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. ఇక అమీషా పటేల్ విషయానికి వస్తే తెలుగులో బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన నాని సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది . ఆ తర్వాత ఒక రెండు మూడు చిత్రాలలో నటించిన అమీషా పటేల్ ఆ తర్వాత పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ కే పరిమితమైంది . అక్కడ పలు చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది . అమీషా పటేల్ అప్పుడప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది. ఇక అందులో భాగంగానే ఇలా జరగడంతో ఇప్పుడు ఈమెకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. మరి దీనిపై అమీషా పటేల్ ఏ విధమైన క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news