భర్తను వదలేసి.. ప్రియుడితో శృంగారం.. ఇక అంతలోనే !

-

రోజు రోజు అక్రమ సంబంధాలు దేశంలో పెరిగి పోతున్నాయి. అయితే.. తాజాగా భర్త నుండి విడిపోయి ప్రియుడితో ఉంటున్న వివాహిత మహిళ కుళ్ళిన స్థితిలో శివమే కనిపించడం కలకలం రేపింది. వివరాలు, తిరువల్లూరు జిల్లా చోళవరం యూనియన్ ఏరుమైవెట్టిపాళ్యం గ్రామానికి చెందిన బాబు స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని భార్య ఆముద.

వీరికి కుమార్తె జయశ్రీ, కుమారుడు కిషోర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నుండి విడిపోయిన ఆముద అదే ప్రాంతానికి చెందిన జగదీశ్వరన్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. పాండిచ్చేరిలో ప్రియుడితో కలిసి ఉన్న అముదను గత 20 రోజుల క్రితం తల్లిదండ్రులు తీసుకొచ్చి బాబుతో కలిపి వెళ్లారు. అయితే వారం రోజుల తర్వాత ఆముద మళ్ళీ భర్తను వదిలిపెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో ఆముద కోసం గాలించిన ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తిరువల్లూరు మున్సిపాలిటీలోని పెద్ద కుప్పంలో మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించింది. మహిళ మృతదేహాన్ని వైద్యశాలకు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ ఆముదగా గుర్తించారు. ఈ సంఘటనపై బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌను పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news