ప్రజల్లో తిరిగితేనే గ్రాఫ్ పెరుగుతుంది – సజ్జల

-

వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలిచే విధంగా సమావేశం చేస్తున్నామని వెల్లడించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లడమే తమ ఎజెండా అని వివరించారు. ప్రజల్లో తిరిగితేనే గ్రాఫ్ పెరుగుతుందని సజ్జల స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎవరి మీద సీరియస్ అయ్యారు అని నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదన్నారు.

చేసే పనిని శ్రద్ధగా చేయమని సీఎం చెప్పారని అన్నారు. ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాలలో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలది పెద్ద పాత్ర అంటూ చెప్పారు. ప్రజల్లో తిరిగితేనే గ్రాఫ్ పెరుగుతోందని.. సర్వేలలో కూడా వస్తుందని సజ్జల స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news