అతను నన్ను దారుణంగా టార్చర్ పెట్టాడు..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకు  లైంగిక వేదింపులు కామన్ అయిపోయింది. ఇక సినిమా పరిశ్రమ లో అయితే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చినా కూడా ఇవి ఆగే అవకాశం కనిపించడం లేదు.

తాజాగా గతంలో తెలుగు సినిమా హీరోయిన్ గా నటించిన ఆశా సైనీ కూడా చిత్ర హింసల పాలు అయ్యిందట. తనకు జరిగిన టార్చర్ ను చెప్పుకొని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.  ఆమె ఇదంతా ఒక వీడియో రూపంలో షేర్ చేసి , తన లోని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె చెపుతూ నేను ఒక సినిమా నిర్మాతను మనస్ఫూర్తిగా గా ప్రేమించాను. కొన్ని రోజులు బాగానే ఉన్న అతను తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు.

అతను ప్రతి రోజు నరకం చూపించాడు. రోజు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అంతటితో ఆగకుండా.. నా ముఖం పై,నా ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసాడు.నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా నన్ను విపరీతంగా టార్చర్ పెట్టాడు. నన్ను ఒంటరిని చేసి  నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేసేవాడు.చివరికి అతని నుండి తప్పించుకుని పారిపోయి బయటకు వచ్చాను. ప్రస్తుతం నాపేరెంట్స్ తో ఉంటున్నాను అన్నారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభవం అని చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news