ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ ను చిత్తు చేసిన ఇండియా

-

ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన ఏ రకమైన స్పోర్ట్ జరిగినా చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఉంటారు. నిన్న రాత్రి ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా హాకీ మ్యాచ్ ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ ను దారుణంగా ఓడించింది. మ్యాచ్ మొదలైన క్షణం నుండి ఆఖరి క్షణం వరకు పాకిస్తాన్ కు కనీసం ఒక్క గోల్ కొట్టే అవకాశాన్ని కూడా ఇండియా ఇవ్వకపోవడం చూస్తే ఎంత డామినేటింగ్ గా మ్యాచ్ జరిగిందో క్లియర్ గా తెలుస్తోంది. మొదటి నుండి ఇండియా దూకుడుగా తమ అతను ప్రదర్శిస్తూ మ్యాచ్ ముగిసే సమయానికి ఇండియా 4 గోల్స్ తో నిలవగా, పాకిస్తాన్ మాత్రమే ఒక్క గోల్ కూడా చేయకుండా 0 తో సరిపెట్టుకుంది.

దీనితో ఇండియా పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. ఇక గోల్స్ చేసిన వారిలో హర్మన్ ప్రీత్ సింగ్ 2 , జుగ్రాజ్ సింగ్ మరియు అక్సాదీప్ సింగ్ లు తలో ఒక గోల్ చేశారు. ఇక ఈ విజయంతో ఇండియా గ్రూప్ లో మొదటి స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news