ఇప్పుడు ఏం చేయలేం.. పీవీ సింధుకు సారీ

-

కొన్ని కొన్ని సార్లు క్రీడల్లో మానవ తప్పిదాలు జరుగుతుంటాయి. కానీ వారి తప్పిదాల వల్ల క్రీడాకారులు తమ పాయింట్లను, స్కోరును కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనే ప్రముఖ బాట్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు ఎదురైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్ షిప్ టోర్నీలో ఆడింది సింధు. అయితే, ఆ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. సింధు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందంటూ ఆమె ప్రత్యర్థి అకానే యమగూచికి రిఫరీ ఓ పాయింట్ కేటాయించాడు. యమగూచి సిద్ధంగా లేదని భావించి సర్వీస్ చేసేందుకు సమయం తీసుకున్నానని తన వాదన వినిపించింది సింధు. కానీ ఆ రిఫరీ వినిపించుకోలేదు. ఆ తర్వాత యమగూచి పుంజుకుని సింధుపై విజయం సాధించింది.

badminton final for Sale OFF 79%

కాగా, బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఈ అంశంపై తాజాగా స్పందించింది. ఆ మ్యాచ్ లో రిఫరీ చేసింది తప్పేనని కమిటీ అంగీకరించింది. పీవీ సింధుకు క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన వెలువరించింది. అది మానవ తప్పిదమేనని, కానీ ఇప్పుడు ఏంచేయలేమని విచారం వ్యక్తం చేసింది బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ. ఈ మేరకు పీవీ సింధుకు బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ లేఖ రాశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news