ASK KTR : ఇవాళ సాయంత్రం 4 గంటలకు లైవ్ లోకి కేటీఆర్

-

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఆయన తన భావాలను ట్విట్టర్ లో ఎక్కువగా వ్యక్తపరుస్తాడనే విషయం విధితమే. దేశ రాజకీయాలు, ప్రజల సమస్యలపై తదితరాలపై ట్విట్టర్ నే ఆయన ఎక్కువగా వేదికగా చేసుకుంటారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ మరోసారి “ఆస్క్ కేటీఆర్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు (శుక్రవారం) సాయంత్రం 4గంటలకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. అయితే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కాలి గాయంతో ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు, మునుగోడులో వేడెక్కిన రాజకీయాలపై నెటిజన్లు వేసే ప్రశ్నలకు మంత్రి సమాధానం ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news