నేడు మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇందులో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాజపా అధికారంలో ఉంది. త్రిపురలో మాణిక్‌ సాహా నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉండగా.. మేఘాలయ, నాగాలాండ్‌లో కాషాయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news