ఒక్కటైనా సిద్ధార్థ మల్హోత్రా – కియారా అద్వానీ.. రిసెప్షన్ ఎప్పుడంటే..!

-

ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ – సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజస్థాన్లోని సూర్యాఘర్ ప్యాలెస్ లో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిందని సమాచారం. ఈ రాజ కోటలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయగా గత వారం రోజులుగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి. నిజానికి ఫిబ్రవరి 6వ తేదీన ఈ జంట పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా వాయిదా పడి ఫిబ్రవరి 7వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకకు కెమెరాలు అనుమతి లేకపోవడంతో ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. కానీ ప్యాలెస్ పరిసర ప్రాంతాలలోనీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారని తెలియడంతో ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజెన్లు. తమ పెళ్ళికి ఈ బాలీవుడ్ జంట ఏకంగా రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. బంధుమిత్రులతోపాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

అంబరాన్ని తాకే పెళ్లి ఏర్పాట్లతో ప్యాలెస్ మెరిసిపోయింది పెళ్లికి వచ్చే వీఐపీల భద్రతా పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. అతిథిలందరికీ ఫోటోలు , వీడియోలు తీయవద్దని చెప్పడంతో ఈ వేడుక తాలూకా ఫొటోస్ పెద్దగా బయటకు రాలేదు. ఇకపోతే ఫిబ్రవరి 12వ తేదీన ముంబైలో సిద్ధార్థ తమ వివాహ రిసెప్షన్ ను నిర్వహించనున్నారని.. దీనికి బాలీవుడ్ ప్రముఖులు మీడియా సిబ్బందిని ఆహ్వానిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news