జగనాసుర రక్త చరిత్ర క్లైమాక్స్ వచ్చేసింది..అందుకే డ్రామాలు – అచ్చెన్నాయుడు

-

జగనాసుర రక్త చరిత్ర క్లైమాక్స్ వచ్చేసింది..అందుకే డ్రామాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గజ దొంగే దొంగా దొంగా అని అరుస్తున్న చందంగా సజ్జల వ్యాఖ్యలున్నాయి… వివేకా హత్యలో అసలు నిందితులెవరో తేలాక కూడా సజ్జల విషం కక్కుతున్నారని ఆగ్రహించారు. వివేకాను చంపిందెవరో చెబితే సహించలేని సజ్జలకు.. వివేకానందరెడ్డి విటుడు అంటూ ప్రచారం చేస్తే సంతృప్తిగా ఉందా? అని నిలదీశారు.

వివేకా హత్యను మొదట చంద్రబాబుకు, తర్వాత సునీతారెడ్డికి అంటగట్టారని.. ఇప్పుడు వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథలు అల్లుతున్నారని ఫైర్‌ అయ్యారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగనాసుర రక్త చరిత్ర క్లైమాక్స్ వచ్చే సరికి సీబీఐ దర్యాప్తును తప్పుపడుతున్నారు…సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో సజ్జలే చెబుతారా?అని ప్రశ్నించారు. మీరు ఎన్ని డ్రామాలాడినా వివేకా హత్యలో దోషులు తప్పించుకోలేరన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news