జగన్ కోడి కత్తి కమల్ హసన్ అని రుజువైంది – అచ్చెన్నాయుడు

-

2018 అక్టోబర్ లో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి జరగడం, దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ కోడి కత్తి కమల్ హాసన్ అని రుజువైందన్నారు. ఎన్నికలలో లబ్ధి పొందేందుకే కోడి కత్తి డ్రామా ఆడారని విమర్శించారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి పైకి నెపం నెట్టి లబ్ధి పొందారని అన్నారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కోడి కత్తి స్క్రిప్ట్ ను జగన్ అమలు చేశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఈ ఘటనతో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు చేసిన డ్రామా ఈరోజు బద్దలైందని విమర్శించారు. సీఎం జగన్ డ్రామాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు ఎన్ఐఏ మీద కూడా నమ్మకం లేదంటారా? అని ప్రశ్నించారు. కుట్రలు, హత్యలు, దారుణాలు చేసిన జగన్ ని రాజకీయాల నుంచి అనర్హుడిగా ప్రకటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news