చత్తీస్గఢ్ లో దారుణం: మహిళా సర్పంచ్ భర్తను హత్య చేసిన మావోయిస్టులు

-

చత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లా రేవాలి పటేల్పర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుందిి. కౌకొండ బ్లాక్ పరిధిలోని రేవాలి పంచాయితీకి చెందిన మహిళా సర్పంచ్ భర్తను మావోయిస్టులు హత్య చేశారు. చత్తీస్గడ్ రాష్ట్రం మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో ఒకటి. చత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రంగా ఉంటుంది.

పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నెపంతోనే మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే జిల్లాలో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏకంగా సర్పంచ్ భర్తను హత్య చేశారు మావోయిస్టులు. పదునైన ఆయుధాలతో మావోయిస్టులు అతడిని హతమార్చారు. నిన్న సాయంత్రం మావోయిస్టులు అతడిని అపహరించారు. మృతుడి పేరు భీముడుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news