బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై టీఆర్ఎస్ కర్రలతో దాడి.. మల్లన్న సంచలన ట్వీట్

-

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య వివాదాలు భ‌గ్గు మంటున్నాయి. లీడ‌ర్ల నుంచి కార్య‌క‌ర్తల వ‌ర‌కు మాట‌ల యుద్ధాలు సాగుతున్నాయి. అయితే తాజా గా ఈ మాటల యుద్ధాలు చేతులు, క‌ర్ర‌ల దాడి వ‌ర‌కు వెళ్లింది. తాజా గా తెలంగాణ‌లోని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు బీజేపీ కార్యాక‌ర్తల‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను బీజేపీ నాయ‌కులు తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న ట్వీట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి గుండాలు.. బీజేపీ కార్య‌క‌ర్త‌లపై దాడి చేస్తున్నారంటూ క్యాప్షన్ జ‌త చేశారు. అలాగే ఈ ట్వీట్ ను ప్ర‌ధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, బీజేపీ జాతీయ అధ్య‌క్షడు జేపీ న‌డ్డా తో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షడు బండి సంజ‌య్ కు, ఎంపీ ధ‌ర్మ‌పూరి అర‌వింద్ కు ట్యాగ్ చేశారు. కాగ ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు టీఆర్ఎస్ పై విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్రాన్ని ప‌శ్చిమ బెంగాల్ గా చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే వీడియోలోని ఘ‌ట‌న జ‌న‌గామ‌లో జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news