సీఎం జగన్ పై దాడి..కీలక విషయాలు వెల్లడించిన సీపీ

-

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై ఈనెల 13న విజయవాడలో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇవాళ దాడి చేసిన నిందితుల సమాచారం తెలిపితే వారికి రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు. తాజాగా బెజవాడ సీపీ కాంతి రాణా మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల దూరం బస్సు యాత్ర జరిగింది. సీఎం జగన్ యాత్ర సందర్భంగా 1480 మంది పోలీస్  సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జగన్ భద్రతా దృష్ట్యా విద్యుత్ సరఫరాను ఆ ప్రాంతంలో నిలిపివేశామని తెలిపారు. సీఎం జగన్ బస్సు పైకి ఎక్కి మాట్లాడుతారనే వైర్లు కట్ చేశామని స్పష్టం చేశారు. నాయకుల ప్రచార సభల్లో ఇవన్నీ సర్వసాధారణమని ఆయన అన్నారు. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో మూడు సెల్ఫోన్ టవర్ల నుంచి డేటాను స్వాధీనం చేసుకున్నారు.

ఘటన జరిగిన సమయంలో 20 వేల సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు తాము గుర్తించామని అన్నారు. ఓ వైపు జనాల రద్దీ, మరోవైపు చికటిని అవకాశంగా తీసుకుని సీఎంపై దాడికి పాల్పడ్డారని సీపీ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 8 బృందాలను నియమించామని పేర్కొన్నారు. త్వరలోనే దాడి చేసిన వారిని పట్టుకుంటామని అన్నారు. అక్కడున్న సీసీ ఫుటేజీని బట్టి ఓ వ్యక్తి దాడి చేయడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి 8.04 నిమిషాలకు సీఎంపై ఆగంతకుడు రాయి విసిరాడని తెలిపారు. ఆ రాయి సీఎం నిలబడిన ఎడమ వైపు నుంచి దూసుకొచ్చిందని అన్నారు. అది జగన్ కనుబొమ్మకి, వెల్లంపల్లి ముక్కు, కంటికి తగిలిందని తెలిపారు. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్ అందుబాటలో ఉందని, ఆ ఫుటేజీని విశ్లేషించేందుకు FSLకి పంపిచామని సీపీ క్రాంతి రాణా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news