షర్మిల ముందే ఏపూరి సోమన్న పై దాడి

-

ప్రజాప్రస్థానంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష 31వ వారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో ప్రారంభించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా వైయస్ షర్మిల ప్రసంగిస్తుండగా దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ టిపీ నేత,ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై వైఎస్ఆర్ టిపి అధినేత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. వారిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని, కంప్లైంట్ రాసి ఇస్తామని తెలిపారు వైయస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news