కరీంనగర్ టీఆర్ఎస్ నేత ఇంటి మీద అర్దరాత్రి దాడి..

-

కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ ఇంటి మీద అర్ధరాత్రి దాడి జరిగింది. రమేష్ ఇంటి మీద దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటి ఆవరణలోని ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన వేరే పార్టీలోకి మారే అవకాశం ఉందంటూ రమేష్ మీద కొద్ది రోజులు బట్టి ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతున్నాడు అని ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ కక్షతోనే ఇలా చేశారని రమేష్ మార్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని గట్టిగా ప్రచారమైతే జరుగుతోంది. ఈ అంశం మీద ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు ఏమిటి అని త్వరలోనే తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news