అప్పు తీర్చమంటే… మహిళను తన్నిన ఆటో డ్రైవర్

-

మంగళగిరి : ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అని కనికరం లేకుండా కాలితో తన్నాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ.. ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం ఉంటోంది. మహానాడులో ఉండగా ఆటో డ్రైవర్ గా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల నగదు వడ్డీకి ఇచ్చింది బాధిత మహిళ.

అయితే.. ఇచ్చిన అప్పు తీర్చమని అడుగుతున్నా కొన్ని రోజులగా గోపి కృష్ణ ఆ మహిళను పట్టించుకోలేదు. దీంతో చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని గోపి కృష్ణ ను నిలదీసింది మహిళ. ఈ నేపథ్యంలో జనసంచారం లేని కృష్ణ కరకట్ట వద్దకు తీసుకొనిపోయి.. ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు యువకుడు. కాలితో ఎగిరి తన్నటంతో ఆ మహిళ కుప్పకూలింది. దీంతో 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది మహిళ… ఈ సంచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది బాధిత మహిళ.

Read more RELATED
Recommended to you

Latest news