జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీయే : అయ్యన్న పాత్రుడు

-

చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడులో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయం అని స్పష్టం చేశారు అంతే కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కూడా ఖాయమని వెల్లడించారు. దీనికోసం పార్టీ కార్యకర్తల సహకారం ఎంతో అవసరమని అన్నారు ఆయన. చంద్రబాబు కోసం కాదు… రాష్ట్రం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని పేర్కొన్నారు అయ్యన్న . వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కార్యకర్తలు పోరాడాలని అన్నారు.

TDP leader and former minister booked for threatening to strip woman  officer | The News Minute

జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీయేనని మండిపడ్డారు అయ్యన్న. పింఛను రూ.3 వేలు ఇస్తామని చెప్పి జనాలను మోసం చేశారని, 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. “ఈ దొంగోడు గెలిచాడు… రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్లీ ఈ దొంగోడు గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది… మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడు. దాంట్లో అనుమానమే లేదు. అందుకే రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది” అని జగన్ పై మాటల తూటాలు పేల్చారు. ఇళ్లకు పార్టీ రంగులు వేస్తున్నారని, ముఖానికి కూడా రంగులేసుకోమను నా*ని అంటూ ఓ బూతు మాట కూడా వదిలారు అయ్యన్న.

 

 

Read more RELATED
Recommended to you

Latest news