టీడీపీ ఎమ్మెల్యేతో బాబు అత్యవసర సమావేశం…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చాలా మంది ఎమ్మెల్యేలు సహకారం అందించకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ కోసం పని చేయడానికి ఆసక్తిగా లేరు. ప్రధానంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విషయంలో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావట్లేదు.

గొట్టిపాటి రవికుమార్ గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనాచౌదరి తో మాట్లాడుతున్నారని బీజేపీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యలు వినిపించాయి. వైసీపీలోకి మళ్ళీ వెళ్లడానికి ఆయన ఆసక్తికరంగా ఉన్నారంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. కానీ వైసిపి లో ఉన్న కొంతమంది నేతలు కారణంగా ఆయన పార్టీ మారలేక పోతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను వైసీపీ నేతలు టార్గెట్ చేసి తమ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన విషయంలో కూడా వైసిపి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆయనను పిలిచి మాట్లాడే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ గొట్టిపాటి రవికుమార్ మాత్రం ఇప్పుడు పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ అద్దంకిలో క్షేత్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news