ఈటల రాముడు…కేసీఆర్‌ దుష్మన్‌ : బాబు మోహన్‌

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు లాంటి వాడని… కేసీఆర్ దళిత బంధువు కాదు దళిత దుష్మన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే సినీనటుడు బాబు మోహన్. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ జమ్మికుంటలో ప్రచారం నిర్వహించారు సినీనటుడు బాబు మోహన్.

రాముడు లాంటి ఈటల రాజేందర్‌ ను కెసిఆర్ కుటుంబం కూడా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు మోహన్. సీఎం కెసిఆర్ మరియు ఆయన కుటుంబం అంతా దళిత వ్యతిరేకులేనని నిప్పులు చెరిగారు. ఇసుక మాఫియా అడ్డుకున్న మన దళితులను పొట్టన పెట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు. పోలీస్ స్టేషన్ లో పెట్టీ కొట్టించారని గుర్తు చేశారు. హుజురాబాద్ లో తెరాసా నాయకులు బిచ్చ గాళ్ళు పడ్డట్టు పడ్డారని చురకలు అంటించారు బాబు మోహన్. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం పగటి కల అని తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు బాబు మోహన్.

Read more RELATED
Recommended to you

Latest news