బిజెపి రాష్ట్రాలపై దాడి చేస్తుంది – బడుగు లింగయ్య యాదవ్

-

మునుగోడులో టీఆరెస్ పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టిఆర్ఎస్ దే గెలుపని అన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలే టీఆరెస్ ను గెలిపిస్తున్నాయని అన్నారు. మునుగోడు ఎన్నికను దేశప్రజలంతా ఆసక్తిగా చూశారని అన్నారు.

బిజెపి కేంద్ర మంత్రులను, ఆరెస్సెస్ ను మునుగొడులో దింపిందని విమర్శించారు. మునుగోడులో బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండిపడ్డారు బడుగు లింగయ్య యాదవ్. బిజెపి ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్నారు. టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి ప్రయత్నించిందని ఆరోపించారు. బిజెపి ప్రజాస్వామికంగా రాష్ట్రాలపై దాడి చేస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక బిజెపికి చెంపపెట్టులాంటిది అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news