హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారానికి నందమూరి బాలకృష్ణ

-

తెలంగాణలో ఈ నెల 21న హుజూర్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఇక‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి హాజరు కానున్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పర్యటనకు సంబంధించి కీలకచర్చలు జరిపినట్లు తెలిసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా పోటీచేసిన టీడీపీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి బాలకృష్ణ పర్యటన సాగుతుందని, ఐదు నుంచి ఆరు రోజులు ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news