బాలయ్య కూడా సెల్ఫ్ డబ్బా మొదలెట్టేసాడా..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవారు అని పేరు వస్తే ముఖ్యంగా మంచు ఫ్యామిలీ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు వారి బాటలోనే బాలయ్య కూడా నడుస్తున్నాడు అనే విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. నిజానికి బింబిసారా సినిమా చూసిన తర్వాత కూడా ఆయన ఇలాగే తమ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతే కాదు తమ కుటుంబంలోని వారే కొత్తవారికి అవకాశాలు ఇస్తారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. దీంతో అప్పుడే విమర్శలు పాలైన బాలయ్య ఇప్పుడు మరొకసారి నోరు జారుతూ విమర్శలకు గురి అవుతున్నాడు.

నిజానికి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై ఏ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయో అందరం చూస్తున్నాం.. ముఖ్యంగా వారి ఓవరాక్షన్ కారణంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం.. మోహన్ బాబు పై, మంచు విష్ణు పదేపదే దేవుడు, వీరుడు, సూరుడు అంటూ ప్రశంసలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా మోహన్ బాబు కూడా పదేపదే తన గురించి, తన నటన గురించి, క్రమశిక్షణ గురించి చెప్పడం వల్ల ఓవరాక్షన్ అనిపిస్తుంది. దీంతో నెటిజన్స్ కూడా వీరిని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మీమ్స్ తో విమర్శిస్తున్నారు. నిజానికి మన గొప్ప అనేది ఇతరులు చెప్పుకోవాలి కానీ మన గొప్ప గురించి మనమే చెప్పుకుంటే అందులో ఏముంటుంది గొప్ప అనేది నెటిజన్ల భావన..

అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా అదే పనే చేస్తున్నాడు. ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రాలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై “నేనే సింహాన్ని.. నేనే గొప్ప.. అందరిలోకి నేనే గ్రేట్” అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులకు సైతం మింగుడు పడడం లేదు. బాలయ్య మరీ ఇంత సెల్ఫ్ డబ్బా అవసరమా అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మునుముందు కూడా ఆయన ఇదే కంటిన్యూ చేస్తే మరో మంచు విష్ణు, మరో మోహన్ బాబు అవుతాడు అంటూ విమర్శలు సైతం చేస్తున్నారు. ఇకనైనా బాలకృష్ణ తన ప్రవర్తనను మార్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news