నర్సులకు బాలయ్య క్షమాపణలు…నా మాటలను వక్రీకరించారంటూ పోస్ట్ !

-

నర్సులకు బాలయ్య క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు బాలయ్య. అందరికి నమస్కారం,నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నా మాటలను కావాలనే వక్రీకరించారని… రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవమన్నారు.

బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూనంటూ నందమూరి బాలకృష్ణ పోస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news