మరో కొత్త అవతారం ఎత్తనున్న బాలయ్య.. ఫ్యాన్స్ కి పండగే..!

-

నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆరుపదుల వయసు వచ్చేవరకు కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి కమర్షియల్ యాడ్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఒకవైపు సినిమాలు, రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న బాలయ్య.. ఇప్పుడు ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో తో కూడా బిజీగా గడిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ తో వ్యాఖ్యాతగా మారనున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఐపీఎల్ 16 ఎడిసన్ కోసం బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

కామెంట్రీ బాక్స్ లో బాలయ్య, వేణుగోపాలరావు, ఎం ఎస్ కె ప్రసాద్, ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, టి సుమన్లతో కలిసి వ్యాఖ్యానించనున్నారు. ఇక బాలయ్య కూడా తనదైన శైలిలో సినిమాకు క్రికెట్ ను అనుసంధానం నుంచి ఎలా వ్యాఖ్యానిస్తాడు అని తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. చిన్నతనం నుంచి క్రికెట్ ను రెగ్యులర్గా ఫాలో అయ్యే బాలయ్య కాలేజీ రోజుల్లో భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడే వారట.

అంతేకాదు గతంలో బాలయ్య సినీ తారలు ఆడే సెలబ్రిటీ లీగ్ లో కూడా తెలుగు వారియర్స్ జట్టుకు సారథ్యం వహించాడు. సమయం దొరికినప్పుడల్లా సెట్స్ లో కూడా క్రికెట్ ఆడేవారని తోటి నటీనటులు చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే క్రికెట్ పై ఉన్న ఆసక్తితోనే బాలయ్య స్టార్ స్పోర్ట్స్ తెలుగు వారి ఆఫర్ ను కాదనలేకపోయారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news