విజయవాడలో బ్లాస్ట్.. 50 మీటర్లు ఎగిరిపడ్డారు !

-

విజయవాడలో భారీ పేలుడు సంభవించింది. విజయవాడలోని సూరంపల్లి మహిళా పారిశ్రామిక వాడలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆ కంపెనీలో స్క్రాప్ కొనేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు ఇద్దరూ మరణించారు. ఈ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే వారి డెడ్ బాడీలు దాదాపు 50 మీటర్ల మేర ఎగరిపడ్డాయి.

అంతేకాక ఆ పేలుడు సంభవించిన చోట భారీ సైజులో పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే భారీ శబ్ధంతో పేలుడు రావడంతో స్థానికులు అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే పేలుడుకు కారణాలు ఏమిటా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పేలుడుకు కారణం ఏమిటా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 10 మంది మరణించారు. ఈ ఘటన అప్పట్లో దుమారం రేపింది కూడా.

Read more RELATED
Recommended to you

Latest news