రామ మందిరం లాగే భాగ్యలక్ష్మి గుడిని మళ్లీ నిర్మిస్తాం : బండి సంజయ్‌

-

ఉత్తర ప్రదేశ్ లో నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం మాదిరిగానే.. పాత బస్తీ లోని భాగ్య లక్ష్మి దేవాలయాన్ని నిర్మిస్తామని బండి సంజయ్‌ సంచలన ప్రకటన చేశారు. భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయం నిర్మాణంతో పాత బస్తీ లోని టూత్ పాలిష్ ఐకాన్ లన్ని కొట్టుకుపోతాయని.. పాత బస్తీ లో ఐకాన్ భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయమేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎంపీ సీటు గెలుస్తామని.. ఆ తర్వాత పాత బస్తీ నుంచి ఎంఐఎం గుండాలను తరిమి కొడతామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ పార్లమెంట్ ను గెలవటమే బీజేపీ లక్ష్యమని.. తెలంగాణ కాషాయ అడ్డ అన్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామని.. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చిండని.. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైందని.. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని.. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవాలని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news