జీవో 118 జారీని స్వాగతించిన బండి సంజయ్

-

ఎల్బీనగర్​లో ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం 118 జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు. ఇది బీజేపీ, బాధితుల విజయం అన్నారు. 8 ఏళ్లుగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని.. ఎట్టకేలకు వారి సమస్య పరిష్కారమైందని హర్షం వ్యక్తం చేశారు.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి భయంతోనే ఈ జీవో జారీ చేసిందని బండి సంజయ్ అన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా వెంటనే జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత పెండింగ్​లో పెడితే కేసీఆర్ సర్కారు అంతు చూస్తామని హెచ్చరించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు పూర్తి పరిష్కారం దొరికే వరకు బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news