సీఎం కేసీఆర్‌ వీపు సాఫ్‌ చేస్తాం – బండి సంజయ్‌

-

కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. లిక్కర్ దందాలో నీ బిడ్డకు సీబీఐ నోటీసులిస్తే.. తెలంగాణ ప్రజలెందుకు ఉద్యమించాలే? డ్రగ్స్, లిక్కర్, క్యాసినో, రియల్ ఎస్టేట్, గ్రానైట్ దందాల్లో కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు అని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు.

విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కేసీఆర్ కుటుంబమని.. రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిన కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ కక్కిస్తామని.. దొంగ దందా చేస్తే మోదీ ప్రభుత్వం వీపంతా సాఫ్ చేస్తదని ఫైర్‌ అయ్యారు.

 

శ్రీకాంతచారిసహా అమరుల బలిదానాలపై రాజ్యమేలుతున్న కేసీఆర్… పెళ్లయి పిల్లలు పుట్టినా.. కల్యాణ లక్ష్మి చెక్కులు వచ్చే పరిస్థితి లేదని విమర్శలు చేశారు. మరోసారి కేసీఆర్ గెలిపిస్తే చెప్పులు నెత్తిమీద పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి వస్తదని.. బీజేపీ అధికారంలోకి రాగానే తిరుమల, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ భూములను తిరిగి రైతులకిస్తామని పేర్కొన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news