రైతుల పాలిట కేసీఆర్ ఓ తాలిబన్ : బండి సంజయ్

-

రైతుల పాలిట తాలిబన్  తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌ ప్రతి ఓటర్ కు 20 వేల రూపాయలు ఇచ్చిందని… 15 వేలు మధ్య లోనే ఆ పార్టీ కార్యకర్తలు దొబ్బేసారని నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యకర్తలకు ఎక్కడ కూడా అడ్డుకోవద్దని చెప్పామని… టీఆర్‌ఎస్‌ పార్టీ కాష్ ను నమ్ముకుందని ఫైర్ అయ్యారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కాలిబర్, క్యారెక్టర్ ను నమ్ముకుంది బీజేపీ అని చెప్పారు. ఈటెల రాజేందర్ పేరుతో ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని… కానీ వారి గోతిలో వారే పడ్డారన్నారు. ఉరి కావాలంటే టీఆర్‌ఎస్‌ కి ఓటు వేయండని బండి సంజయ్‌ పేర్కొన్నారు. సిద్దిపేట, ఖమ్మం కలెక్టర్ లపై చర్యలు తీసుకోవాలి… లీగల్ గా పోరాటం చేస్తామని….స్పష్టం చేశారు బండి సంజయ్‌. ధాన్యం కొనక పోతే కొనిపిస్తాం… కొనేది కేంద్రం…. వీళ్లు చేసేది బ్రోకరిజం మాత్రమేనని తేల్చి చెప్పారు. హుజురాబాద్‌ గెలిచేది బీజేపీనేనని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో జోక్ కాదని.. హరీష్ రావు జోకర్ అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news