హుస్సేన్ సాగర్ నీళ్ళు ఒకసారి తాగు – కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

-

పోటోల కోసం నిర్మలా సీతారామన్ రాలేదని కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రైతు ద్రోహివి నువ్వు కెసిఆర్ అని.. వరికుప్పల మీద రైతులు చనిపోయారన్నారు. ఫ్రీ ఎరువులు ఇస్తా అన్నావు.. రుణ మాఫీ చేయలేదు.. ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకొలేదని వెల్లడించారు. పక్క రాష్ట్రం లో చెల్లని చెక్కులు ఇచ్చావు.. పోటొ ల కోసం నిర్మలా సీతారామన్ రాలేదు.. నీ బండారం బయట పడ్డదన్నారు.

కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని రూపాయికి అమ్ముకున్నావు.. 80 వేల ఉద్యోగాలు ఇస్తే వెయ్యి కోట్లు ఎలా సరిపోతాయని నిలదీశారు. తెలంగాణ వచ్చాక కూడా ఇంకా గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతున్నారని ప్రశ్నించారు. వేములవాడ ఎమ్మెల్యే ఇంకా జర్మనీ లో ఉంటున్నాడు.. హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళల చేస్తా అన్నావు… పోయి ఒక సారి తాగు అని మండిపడ్డారు. నీకు ఎందుకు ఓటు వేయాలి .. దళిత బందు ఇవ్వనందుకు, డబుల్ బెడ్ రూం ఇవ్వనందుకు, బీసీ ల ను మోసం చేసినందుకు ఓటు వేయాలా…? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news