హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది.. రోహింగ్యాలు పెరిగారు – బండి సంజయ్

-

హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది, రోహింగ్యాలు విపరీతంగా పెరిగిపోయారన్నారు బండి సంజయ్.దేశంలో ఎక్కడా ఉగ్రవాద సంఘటన జరిగిన హైదరాబాద్ పాతబస్తీ కి లింక్ ఉంటుంది..హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 30వేలకు పైగా సర్టిఫికేట్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఫైర్ అయ్యారు.

27వేల బర్త్ సర్టిఫికేట్స్, 5వేల డెత్ సర్టిఫికేట్స్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది..హైదరాబాద్ లో సర్టిఫికేట్స్ తీసుకోవడం ఈజీ అనీ ఎన్ ఐ ఏ గుర్తించిందన్నారు. ఈ ఘటన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కొడుకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పాతబస్తీ పరిధిలో 30వేల సర్టిఫికేట్స్ రద్దు చేయడం మాములు విషయం కాదు..ముఖ్యమంత్రి కొడుకు నైతిక బాధ్యత వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news