ధనిక రాష్ట్రమైతే జీతాలు ఎందుకిస్తలేరు : బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమైతే.. ఉద్యోగులకు జీతాలు ఎందుకివ్వట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ వేద పాఠశాల ఉండాలని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలోని బ్రాహ్మణులతో ఆయన సమావేశమయ్యారు.

భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో వేద పాఠశాల కోసం తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, మీ బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్నానని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం, నెల్లుట్ల నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. జనగాం టౌన్, నెహ్రూ పార్క్, ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా రెడ్డి సంఘం వరకు కొనసాగనుంది.

“తెలంగాణ ఆర్థికంగా ధనిక రాష్ట్రమట. మరీ జీతాలు ఎందుకిస్తలేవ్. ధూప దీప నైవేద్యాలు స్కీమ్​పై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నువ్విచ్చే ఆరు వేలు ఎందుకు సరిపోతాయి. హారతి, కర్పూరం పాకెట్ రేటు ఎంత? మీ వీఐపీలు వస్తేనే ఖర్చయితాయ్ “– బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news