మా పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడితే ఊరుకోం : బండి సంజయ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తమ పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ కు మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే సీఎం డిప్రెషన్ లోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. మరోవైపు తన కొడుకు, కూతురిపై వస్తున్న అవినీతి ఆరోపణలు చూసి కేసీఆర్ భయపడుతున్నారని సంజయ్ అన్నారు.
గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి నలుగురు మహిళలను పొట్టనబెట్టుకున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదని అన్నారు. కనీసం మృతుల కుటుంబాలను ఇప్పటి వరకు ఆదుకోలేదని.. కనీసం వాళ్లను కలిసి సానుభూతి కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. పేదింటి మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలంటే భయపడే పరిస్థితులు తీసుకువచ్చారని మండిపడ్డారు. నలుగురు మహిళల ప్రాణాలు పోవడానికి బాధ్యులైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news