ఈసీ చీటింగ్ చేసిందంటూ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టిన బండి సంజయ్

-

ఈసీ చీటింగ్ చేసిందంటూ బండి సంజయ్ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. ఎన్నికల కమిషనర్ ఒక సర్క్యులర్ జారీ చేశారని, బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు  కాకుండా ఏ గుర్తు వేసిన ఆ ఓటును పరిగణించాలని అందులో పేర్కొన్నారని ఆయన అన్నారు. అర్థరాత్రి సర్క్యులర్ జారీ చేయడం లో ఆంతర్యం ఏంటి ? అని ప్రశ్నించిన ఆయన ప్రగతి భవన్ ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ పాటిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ గ్యాంబ్లింగ్ కి పాల్పడిందని ఇప్పటికే అనేక అనుమానాలు వస్తున్నాయని అన్నారు.

ఓటింగ్ శాతం పెరిగింది.. మాకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నామని కానీ 5 గంటల నుండి 6 గంటల వరకు పోలింగ్ లో గ్యాంబ్లింగ్ జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్ చరిత్ర హీనుగా మిగులుతారా ? అని ప్రశ్నించిన ఆయన ఈసీ పక్కా చీటింగ్ చేసిందని అన్నారు. గ్రేటర్ ఆఫీసు లో సోమేశ్ కుమార్, డీజీపీ ,పోలీస్ అధికారులు కూర్చొని మాయ చేశారని అన్నారు. ఈ సీఎంను వదిలి పెట్టం, అవినీతి పాలన, నీచమైన ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. కౌంటింగ్ సెంటర్ లలో అడ్డుకోమన్న ఆయన ఏదయినా కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news