కన్నతల్లిని చంపి… దండేసి కీర్తించే బాపతు కేసీఆర్ – బండి సంజయ్

-

 

కన్నతల్లిని చంపి… దండేసి కీర్తించే బాపతు కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించాడని… చనిపోయాక దండేసి కీర్తిస్తున్నాడని నిప్పులు చెరిగారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని… అసెంబ్లీలో అంబేద్కర్, గాంధీజీలను ఆకాశనెత్తుతాడని ఆగ్రహించారు.

సర్పంచ్ లుసహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను సర్వ నాశనం చేసిన కేసీఆర్… దమ్ముంటే పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా?మొక్కలు ఎండిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తున్నారు… మరి నిన్నెందుకు సస్పెండ్ చే యొద్దు? అన్నారు. రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి…ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలకు ఇండ్లు, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారుబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news