మతతత్వ విద్వేషాలు పక్కా రగిలిస్తాం : బండి సంజయ్ సంచలనం

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మత తత్వ విద్వేషాలు పక్క రగిలిస్తామని… 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని… రెచ్చగొట్టడం ఇంకా తాము మొదలు పెట్టలేదని స్పష్టం చేశారు. Mim అడ్డాను బద్దలు కొట్టి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర సభ పెట్టామని తెలిపారు.

ఛాలెంజ్ చేస్తే… ఆ గల్లీ లోకి వచ్చి కాషాయ జెండా ఎగురవేస్తామని హెచ్చరించారు బండి సంజయ్‌. దేశద్రోహి పార్టీ నాయకుడు సవాల్ చేస్తే భయపడ్డ దద్దమ్మల పార్టీ టీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. నిజాం ఆస్తుల ను స్వాధీనం చేసుకుంటామని… హిందు సమాజానికి ఇస్తామని స్పష్టం చేశారు. 111 జీఓ ని రద్దు చేస్తా అని ఎందుకు చేయలేదని.. కేసీఆర్ కుటుంబం భూములను తక్కువకు కొని ఎక్కువగా అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. 111 జీఓ పరిధిలో కేసీఆర్, కేటీఆర్‌, కవిత, హరీష్‌ రావు కు ఫార్మ్ హౌస్ ఉందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news